amp pages | Sakshi

'కేసీఆర్‌కు మాట తప్పడం అలవాటైంది'

Published on Sat, 11/18/2017 - 16:39

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాలు 50 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం 16 రోజులకే ముగించేందుకు ప్రతిపక్షాలతో సంప్రదింపులు చేస్తున్నారని శాసనసభలో బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభ సమావేశాల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సభలో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పొగిడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. ముఖ్యమంత్రి నిజాంను పొగిడారని ఎద్దేవా చేశారు. నిజాం చరిత్రను తిరగరాస్తానని సీఎం శాసనసభలో ప్రకటిస్తే మరోవైపు మజ్లిస్ పార్టీ సీఎంను పొగిడిందన్నారు. నిజాం చరిత్ర నేటితరానికి తెలియాలంటే ఆనాడు తెలంగాణ ప్రజలు, రైతులపై నిజాం ప్రభుత్వం సాగించిన దోపిడీ, దాష్టీకాల గురించి, నిజాం రజాకార్లను ఎదిరించేందుకు ప్రజలు నిర్మించుకున్న బురుజుల గురించి కూడా సీఎం తాను రాయించబోయే చరిత్రలో పొందుపర్చాలని కోరారు.

ఈ సమావేశాల్లో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని చెప్పారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోందన్నారు. రాష్ట్రంలో 14 నెలలుగా జిల్లా పరిషత్ సమావేశాలు జరగడం లేదని తాను ఆరోపిస్తే కేంద్రం నిధులివ్వడం లేదని కేంద్రంపై మోపే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న 14 వ ఆర్థిక సంఘం నిధుల్ని కూడా వినియోగించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం శాసనసభను తమ పార్టీ ప్రచార వేదికగా తయారు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి మాట తప్పడం అలవాటుగా మారుతోందని, దళిత సీఎం హామీ నుంచి ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి లేఖ రాస్తానన్న హామీ వరకు ఇది నిరూపితమైందని ఆయన అన్నారు.

కనీసం బీఏసీ సమావేశం నిర్వహించకుండా శాసనసభ సమావేశాలు వాయిదా వేశారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 34 రోజులు నిర్వహించాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రతిపక్ష నేతల సంతకాలతో కేంద్రానికి సీఎం లేఖ రాస్తానన్నారు కానీ మా సంతకాలు లేకుండానే సీఎం కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం ప్రతిపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణపై ఒత్తిడి తేవాలని కోరారు. కాగా, రాణి పద్మావతి సినిమా దర్శకుడు చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు. ఆ సినిమాపై రాజపుత్ర సంఘాల అభ్యంతరాలను దర్శకుడు పరిగణనలోకి తీసుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌