amp pages | Sakshi

టీఆర్‌ఎస్‌తో ఇక కయ్యమే! 

Published on Tue, 12/19/2017 - 01:39

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై బీజేపీ కయ్యానికి సిద్ధమవుతోంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అదే ఊపుతో తెలంగాణలోనూ విస్తరించాలని కోరుకుంటోంది.  దీనికి అనుగుణంగా రాష్ట్రంలో నాలుగైదు రోజుల పాటు మకాం వేసి, పార్టీ బలోపేతానికి రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జనవరిలోనే అమిత్‌షా తెలంగాణ పర్యటన ఉంటుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీ బలం, బలహీనతలపై జాతీయ నాయకత్వం ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సమగ్ర నివేదికను తెప్పించుకుంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు అవసరమైన మార్గాలను కూడా అన్వేషించినట్టు సమాచారం.

టీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారాలపైనా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ముఖ్యమైన నేతలపై కూడా కన్నేసినట్టుగా తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచి సంఘ్‌తో సంబంధాలున్న నాయకులే ఇప్పటిదాకా బీజేపీలో కీలకపాత్ర పోషించేవారు. అయితే, తెలంగాణలో ఇప్పుడా సంప్రదాయాన్ని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీని విస్తరించే సామర్థ్యం, గెలిచే సత్తా ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడానికి జాతీయ నాయకత్వం ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతలతో ప్రాథమికంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదని సమాచారం. ఇంతలోనే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు రావడంతో చర్చలకు అంతరాయం కలిగిందని బీజేపీకి చెందిన జాతీయ నాయకుడొకరు వెల్లడించారు. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్చలు మళ్లీ జరుగుతాయని తెలిపారు.  

టీఆర్‌ఎస్‌ నేతలపైనే దృష్టి: టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతోనూ అమిత్‌షా టచ్‌లో ఉన్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లోని ఏ స్థాయి నాయకులతో ఆయన మాట్లాడుతున్నారనే విషయంపై వారు స్పష్టత ఇవ్వడంలేదు. కాగా, జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అమిత్‌షా స్థాయిలో చర్చలు జరపాలంటే ఏ పార్టీలోనైనా కీలకంగా ఉన్నవారే అయివుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనవరిలోనే అమిత్‌షా పర్యటన ఉంటుందని, ఇది కీలకం కాబోతోందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. తమ అధ్యక్షుడి దృష్టి అంతా టీఆర్‌ఎస్‌ నేతల చుట్టూనే తిరుగుతున్నదని అంటున్నారు.  

ఎంపీ సీట్ల వారీగా ఇన్‌చార్జీలు: బీజేపీ రాష్ట్ర నేతల మధ్య సయోధ్య, సమన్వయం లేకపోవడం ఇప్పటిదాకా ఆ పార్టీ బలోపేతానికి అవరోధంగా ఉందని జాతీయ నాయకత్వానికి పలు ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. దీనిని అధిగమించడానికి జాతీయ నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగాలనే యోచనకు వచ్చినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికోసం రాష్ట్రంలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జాతీయస్థాయి నాయకుడికి బాధ్యతలు అప్పగించి, బూత్‌స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించాలని నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే సమారు 13 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన మండలస్థాయిలోని రాజకీయ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి, నివేదికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు 5 లోక్‌సభా స్థానాలు, బిహార్‌ మంత్రి మంగళ్‌పాండేకు 4, కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు 4 నియోజకవర్గాల బాధ్యతలను స్థూలంగా అప్పగించింది. రాంమాధవ్‌ ద్వారా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకోగా, మంగళ్‌పాండే ద్వారా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ద్వారా నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్‌ నియోజకవర్గాల ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అమిత్‌షా పర్యటన తర్వాత ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జాతీయనేతను ఇన్‌చార్జిగా చేసి, బూత్‌స్థాయిలో పార్టీ విస్తరణకు వ్యూహం రచిస్తున్నట్టు చెబుతున్నారు.  

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)