amp pages | Sakshi

అన్నీ బయటపెడతా: బాబుమోహన్‌

Published on Sat, 09/29/2018 - 17:51

సాక్షి, న్యూఢిల్లీ : ఇరవై ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నుంచి ఫోన్‌ రాకపోవడంతోనే తాను బీజేపీలో చేరినట్లు ఆందోల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ అన్నారు. శనివారం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినందు వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని బాబుమోహన్‌ వ్యాఖ్యానించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో హరీశ్‌రావు ఫోన్‌ చేసి తనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారన్నారు. వారు చెప్పినట్లుగానే ఆందోల్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. కానీ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆ 105 మందిలో తానొక్కడినే పనికి రాని వాడిని అయ్యానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు తాను ఎందుకు పనికిరాలేదో, టికెట్‌ ఎందుకు ఇవ్వలేదోనన్న విషయాలన్నీ సమయం వచ్చినపుడు బయటపెడతానని వ్యాఖ్యానించారు.

పదవుల కోసం కాదు..
టికెట్‌ విషయమై కేటీఆర్‌ను అడిగితే కేసీఆర్‌ ఫోన్‌ చేస్తారని చెప్పారని, కానీ ఇంతవరకు ఆయన నుంచి ఫోన్‌ రాలేదని బాబుమోహన్‌ అన్నారు. అదే సమయంలో అమిత్‌ షా పిలిచి తనకు అవకాశం ఇచ్చారని బాబుమోహన్‌ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాల నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనతో పాటు, తన కుమారుడు ఉదయ్‌ కూడా బీజేపీలో చేరారని బాబుమోహన్‌ తెలిపారు. పదవుల కోసం కాకుండా కేవలం పనిచేయడం కోసమే పార్టీలో చేరామని స్పష్టం చేశారు. (చదవండి: టీఆర్‌ఎస్‌కు మరో షాక్‌)

స్వార్థ రాజకీయాలు చూడలేకే : లక్ష్మణ్‌
మూడు పర్యాయాలు ఆందోల్ ఎమ్మెల్యే గా గెలుపొందిన బాబుమోహన్... నటుడిగా కూడా ప్రజల గుండెల్లో నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కలిసి కూటమిగా పోటీ చేసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. ఇలాంటివి చూడలేకే బాబుమోహన్‌ బీజేపీలో చేరారని వ్యాఖ్యానించారు. మరోవైపు మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అది మహాకూటమి కాదు విషకూటమి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టీడీపీలకు ఓటు వేస్తే మూసీనదిలో వేసినట్లేనని విమర్శలు గుప్పించారు. కాగా అక్టోబర్‌లో అమిత్‌ షా మరోసారి తెలంగాణకు వస్తారని లక్ష్మణ్‌ తెలిపారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)