amp pages | Sakshi

అగ్రిగోల్డ్‌ విలన్‌ చంద్రబాబే 

Published on Sat, 11/09/2019 - 09:57

సాక్షి, గుంటూరు : అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగకుండా అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి న్యాయం చేస్తే ఓర్వలేకపోతున్నారని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్‌ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. ప్రభుత్వం తొలి దశలో రూ.1150 కోట్లు కేటాయించి రూ.20 వేల లోపు బాధితుల కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిందని, రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారి ఖాతాల్లో ఇప్పటికే నగదు జమయిందని తెలిపారు. దీనిని భరించలేని చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, ఇతర టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం చూస్తే సిగ్గేస్తుందని చెప్పారు.

అగ్రిగోల్డ్‌పై నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్‌పై నిజానిజాల నిగ్గు తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. లోకేశ్‌ తన ట్విట్టర్లో పెట్టిన దానికి కట్టుబడి ఉండే పక్షంలో తన చాలెంజ్‌ను స్వీకరించాలని సవాలు విసిరారు. లేని పక్షంలో తన ట్విట్టర్‌ ఖాతా క్లోజ్‌ చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ అంశంపై కోర్టుకు వెళ్లినప్పుడు ఎస్‌.ఎల్‌. గ్రూప్‌ వారి ఆస్తులను టేకోవర్‌ చేస్తానందని, 2018, ఏప్రిల్‌ 3న ఆ గ్రూప్‌ సభ్యులతో చంద్రబాబు ఢిల్లీలో మంతనాలు జరిపి వారిని బెదిరించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

2018 ఏప్రిల్‌ 3వ తేదీ అర్ధరాత్రి ఢిల్లీ ఏపీ భవన్‌ సాక్షిగా చంద్రబాబు –అగ్రిగోల్డ్‌ ఎం.డి. సీతారామ్, ఎస్‌.ఎల్‌.గ్రూప్‌ సుభాష్‌ చంద్ర, మాజీ ఎంపీ అమర్‌ సింగ్‌తో  చీకటి ఒప్పందానికి ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు భయపడే ఎస్‌ఎల్‌ గ్రూప్‌ వెనక్కు తగ్గిందని వెల్లడించారు. ఆ సమావేశం జరిగిన వారం తర్వాత ఆ గ్రూప్‌ సభ్యులు అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొనడం లేదని హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారని అప్పిరెడ్డి గుర్తు చేశారు.వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన అయిదు నెలల్లోనే ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలుచేసి ప్రజల మన్నన పొందారన్నారు.  సమావేశంలో వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు.  

Videos

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)