amp pages | Sakshi

ఏ కుటుంబాన్ని టార్గెట్‌ చేయలేదు : అమిత్‌ షా

Published on Tue, 12/03/2019 - 16:52

సాక్షి, న్యూఢిల్లీ : ఏ ఒక్క కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేయలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు అమిత్‌ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీజీ అనేది స్టేటస్‌ సింబల్‌ కాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఎస్పీజీ చట్టానికి సవరణ చేయడం ఇది ఐదవసారి అని అమిత్‌ షా గుర్తుచేశారు. అయితే గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సవరణ చేయలేదని స్పష్టం చేశారు. కానీ గతంలో జరిగిన నాలుగు సవరణలు కూడా గాంధీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే జరిగాయని విమర్శించారు. ఎస్పీజీ భద్రతను కేవలం గాంధీ కుటుంబానికే కాకుండా.. మాజీ ప్రధానులకు కూడా తొలగించిన విషయాన్ని గమనించాలన్నారు. 

కేవలం గాంధీ కుటుంబాన్ని మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాంగ్రెస్‌ నేతలు గాంధీ కుటుంబానికి ఎస్పీజీ కావాలని ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ముప్పు ఆధారంగానే భద్రత తొలగించినట్టు స్పష్టం చేశారు. ఎస్పీజీ భద్రత ప్రధాన మంత్రికి మాత్రమే ఉంటుందని వెల్లడించారు. అమిత్‌ షా ప్రసంగం అనంతరం.. ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే దీనిని నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. కాగా ఎస్పీజీ సవరణ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన  సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించింది. 

ఆ ఘటన యాదృచ్ఛికంగా జరిగింది : షా
కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇంటి వద్ద భద్రత లోపంపై అమిత్‌ షా స్పందించారు. ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్సెండ్‌ చేసినట్టు వెల్లడించారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)