amp pages | Sakshi

‘ఫ్రంట్‌’పై చర్చలకే టీడీపీకి బెంబేలెందుకు?

Published on Thu, 01/17/2019 - 03:24

సాక్షి, అమరావతి: ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలు జరిపితే టీడీపీ నేతలు ఎందుకు బెంబేలెత్తుతున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌ తదితరులు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చలు జరిపితే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని పేర్కొంటున్న టీడీపీ నేతలు గురివింద నీతిని మర్చినట్లున్నారన్నారు. హరికృష్ణ చనిపోయిన సమయంలో పరామర్శకు వచ్చిన కేటిఆర్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుందామని అడిగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లు అన్పించలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఛీ...పో అని చెప్పారు కాబట్టే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అని చంద్రబాబు ప్రకటించిన విషయం ప్రజలందరికి తెలుసు అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో జరిగిన పరిణామాలు రాష్ట్రానికి శుభపరిణామంగా భావిస్తున్నాం అన్నారు. జగన్‌ వారితో చర్చలు జరిపితే టీడీపీ నేతలు కుక్కల్లా మొరగడం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.

టీఆర్‌ఎస్‌ పార్టీతో వైఎస్సార్‌సీపీ ఎక్కడా పొత్తు పెట్టుకోలేదన్న విషయం గుర్తించాలన్నారు. మొత్తం 42 లోక్‌సభ సీట్లు ఉన్న రెండు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టవచ్చనే ఆలోచనతోనే ఫెడరల్‌ ఫ్రంట్‌పై ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలిపారు. దీనికే భయపడి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నానా యాగి చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మం అని కేసీఆర్‌ చెబుతున్నపుడు వారితో సంప్రదించడం తప్పా అని టీడీపీ నేతలను అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతూ వారికి అనుకూల ఛానళ్లలో విమర్శలు, ఆరోపణలతో సిద్ధమైపోవడం దారుణం అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే వ్యక్తులు బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. జాతీయ పార్టీలు బలహీనపడి ప్రాంతీయ పార్టీలు బలపడుతున్న ఈ దశలో ప్రాంతీయ పార్టీలు ఒక తాటిపైకి రావడం శుభపరిణామం అన్నారు. ఈ అంశంలో చంద్రబాబు ప్రజలను కన్ఫ్యూజ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అయోమయానికి గురికావద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వైఎస్‌ షర్మిలపై దుష్ప్రచారం బాధాకరం...
వైఎస్‌ షర్మిలపై దుష్ప్రచారం బాధాకరం అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.  రాజకీయలబ్ధి కోసం ఏదైనా మాట్లాడే చంద్రబాబు రాజకీయప్రత్యర్థుల వ్యక్తిత్వాల్ని దెబ్బతీసేందుకు నీచ సంస్కృతికి తెరతీస్తున్నారన్నారు. గతంలో కూడా షర్మిలపై సోషల్‌ మీడియాలో అపవాదులు వేసి ప్రచారం చేశారు. ఈ విషయాలను ప్రజలందరూ తెలుసుకోవాలని కోరారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)