ముంబైలో ప్రేమికుల దినోత్సవానికి ఆటవిడుపు

Published on Sun, 02/14/2016 - 00:42

ఈసారి ముంబైలో ప్రేమికుల దినోత్సవానికి ఆటవిడుపు కలిగేటట్టు ఉంది. అంటే శివసేనకి కొంచెం నిరాశే మరి. ఎందుకంటే ఇండియా బర్డ్ రేస్ కార్యక్రమంలో భాగంగా ఇవాళే ముంబైలో బర్డ్ రేస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బర్డ్ రేస్ అంటే పక్షులు గుర్రాల్లా పోటీ పడవు. పందెం కోళ్లలాగా పోట్లాడుకోవు. పక్షి ప్రేమికులే ముంబైకి అరవై కిలోమీటర్ల పరిధిలో అనేక జాతుల పక్షులను గుర్తించ డంలో పోటీ పడతారు. ముంబై 12వ బర్డ్ రేస్‌లో 14 నగరాల నుంచి పర్యావరణ, పక్షి ప్రేమికులు పాల్గొంటున్నారు.
 
 వీరంతా బృందాలుగా విడిపోయి అన్వేషణ ఆరంభిస్తారు. ఈసారి 350 రకాల పక్షులను అక్కడ వదులుతున్నారు. 11వ ముంబై బర్డ్ రేస్‌లో వీటి సంఖ్య 150 మాత్రమే. అయితే అప్పుడు ఓ అపురూప ఘటన జరిగింది. విజయాబాలన్ అనే 72 ఏళ్ల మహిళ తన కుమార్తె సాయంతో 70 వరకు పక్షి జాతులను గుర్తించి అగ్రస్థానంలో నిలిచింది. ఇంతకీ ఆమె కేన్సర్ వ్యాధిగ్రస్తురాలు. ఆ పక్షులని ఆమె పామ్ బీచ్‌లోని మామిడితోటల్లోనే కనుగొంది.  పర్యావరణ, జీవకారుణ్యం పట్ల మరింత అవగాహన పెంచడానికే దేశంలోని వివిధ నగరాల్లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు.  ఈ పోటీలతో విచిత్రమైన ఫలితాలు రావడం విశేషం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ