అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మా అనుమతి లేకుండా నియమించొద్దు
Published on Thu, 12/18/2014 - 03:38
- సీవీసీ, వీసీలపై కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ), విజిలెన్స్ కమిషనర్(వీసీ)లను నియమించే ముందు తమ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఎంపిక ప్రక్రియ గురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. ‘‘ఎవరిని నియమించారన్నది మాకు అవసరం లేదు.
కానీ తగిన పద్ధతిలో ఆ నియామకం జరిగిందా లేదా అన్నది చూడడమే మా కర్తవ్యం. ఇకపై మా అనుమతి లేకుండా ఆయన(అటార్నీ జనరల్) ఈ నియామకాల విషయంలో చర్యలు తీసుకోరని మేం విశ్వసిస్తున్నాం.
మీరు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లడానికి ముందు మా దగ్గరకు రండి(అనుమతి కోసం)’’ అని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ.. సీవీసీ, వీసీల ఎంపిక ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతిచ్చింది.
#
Tags