amp pages | Sakshi

‘మార్గదర్శి’ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌

Published on Wed, 12/18/2019 - 02:37

సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమపై ఉన్న క్రిమినల్‌ కంప్లయింట్‌ (సీసీ) నెంబర్‌ 540ని కొట్టివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని, దీనిని ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారించి సీసీ 540ని కొట్టివేసిందని పిటిషన్‌లో వివరించారు. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అప్పీలు చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఒక అప్లికేషన్‌ దాఖలు చేయడంతోపాటు హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆయన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు.

ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు 2018 డిసెంబరు 31న ఈ తీర్పు వెలువడిందని పిటిషన్‌లో పేర్కొన్న ఉండవల్లి.. ఈ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని మరో అప్లికేషన్‌ దాఖలు చేశారు. అవిభక్త హిందూ కుటుంబ సంస్థ(హెచ్‌యూఎఫ్‌) అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేయగా, ఉమ్మడి హైకోర్టు ఈ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)ను తప్పుగా అన్వయించిందని, ‘అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండివిడ్యువల్స్‌’పరిధిలోకి హెచ్‌యూఎఫ్‌ రాదని, ఈ నేపథ్యంలో సెక్షన్‌ 45ఎస్‌(2) పరిధిలోకి తేవొద్దని చెబుతూ క్రిమినల్‌ కంప్లయింట్‌ను కొట్టేసిందని పిటిషన్‌లో వివరించారు.

అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2006 నవంబర్‌లో రాసిన లేఖకు 2007 జూన్‌ 2న ఆర్‌బీఐ బదులిస్తూ.. ప్రతివాది చాప్టర్‌ 3బి కింద అర్హత కలిగి లేడని, సెక్షన్‌ 45ఎస్‌ కింద లావాదేవీలు జరిపేందుకు వీలులేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పైగా సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టులో సివిల్‌ అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా.. క్రిమినల్‌ కంప్లయింట్‌ను కొట్టివేయడంతో ఆ అప్పీళ్లన్నీ ఫలితం లేనివిగా మారిపోయాయని నివేదించారు.

ఇదీ నేపథ్యం..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్న అభియోగంపై ఇదే చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) ఆధారంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబర్‌ 19న ఉత్తర్వులు వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్‌.రంగాచారిని నియమిస్తూ జీవో నెంబర్‌ 800 జారీచేసింది.

అలాగే ఈ సంస్థపై ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్‌ చేసేందుకు అప్పటి సీఐడీ ఐజీ కృష్ణ రాజును జీవో నెంబర్‌ 801 ద్వారా అధీకృత అధికారిగా నియమించింది. ఎన్‌.రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణరాజు 23 జనవరి 2008న ఫస్ట్‌ అడిషనల్‌ చీఫ్‌ మెట్రొపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీసీ నెంబర్‌ 540 దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2010లో ఈ పిటిషన్‌ను ఆ న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ తిరిగి 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సీసీ నెంబర్‌ 540లో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇచ్చింది. అయితే ఏ కేసులోనైనా స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని సుప్రీంకోర్టు 2018 మార్చి 28న తీర్పు వెలువరించింది. విచారణ కొనసాగించడం కంటే స్టే పొడిగించడమే అవశ్యమనుకున్న కేసుల్లో స్టే కొనసాగింపునకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ స్టే పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కానీ స్టే పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. 2011లో తాము దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ను విచారించాలని అభ్యర్థించింది. దీనిని విచారించిన ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉన్న క్రిమినల్‌ సీసీ నెంబర్‌ 540ని కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్‌ ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)