వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులకు యూజీసీ సాయం
Published on Thu, 03/05/2015 - 02:03
వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: వర్శిటీలు, కళాశాలల అధ్యాపకుల మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులకు యూజీసీ ఆర్థిక సాయం అందిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పనితీరు ఇండెక్స్, వారి ప్రాజెక్టులకు అందుతున్న సాయంపై వైఎస్సార్సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు హెచ్చార్డీ మంత్రి స్మృతీ ఇరానీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
యూజీసీ రెగ్యులేషన్స్-2010 ప్రకారం అధ్యాపకుల పనితీరును 3 కేటగిరీలుగా యూజీసీ అంచనా వేస్తుందని తెలిపారు. మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో హ్యుమానిటీస్ అయితే రూ. 15 లక్షలు, సైన్స్ సబ్జెక్టులైతే రూ. 20 లక్షల సాయం అందిస్తుందని, మూడేళ్లలో 4,276 ప్రాజెక్టులకు యూజీసీ సాయం అందించిందని వివరించారు.
Tags