వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కశ్మీర్ ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల మృతి
Published on Mon, 11/11/2019 - 11:55
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లోని బండిపర జిల్లాలో సోమవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరోవైపు ఇదే ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకుని ఉంటారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఉగ్ర కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు బండిపర జిల్లాలోని లదౌర ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించి కాల్పులకు తెరపడ్డాయి. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా, భద్రతా దశాలు ఎదురుకాల్పులకు దిగాయి. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా మూడువారాల కిందట అవంతిపురలో భద్రతా దళాల ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.
#
Tags