నువ్వు పులివైతే నేను కొండ చిలువ!

Published on Sun, 09/02/2018 - 09:32

సాక్షి, మైసూరు : తన పరాక్రమం, రాజసంతో అడవిని ఏలే పులిరాజును ఓ కొండచిలువ తోక ముడిచేలా చేసింది. పులులకు ఆలవాలమైన మైసూరు జిల్లాలోని నాగరహళె అటవీప్రాంతంలో శనివారం జరిగిన ఈ సంఘటన పర్యాటకుల కంటపడింది. అటవీ ప్రాంతంలో గంభీరంగా నడుచుకుంటూ వెళుతున్న పెద్దపులి తన దారికి అడ్డంగా కొండచిలువ ఉండడాన్ని గమనించింది. నిదానంగా కొండచిలువను సమీపించిన పులి తన దారి నుంచి తప్పుకోవాలన్నట్లుగా పంజాతో దానిపై మెల్లగా తట్టింది. దీంతో అప్రమత్తమైన కొండచిలువ పెద్దపులిపై తిరగబడింది. మరోసారి కొండచిలువను భయపెట్టడానికి పులి ప్రయత్నించగా ఏమాత్రం వెనక్కి తగ్గని కొండచిలువ పులి మీదకు దూకే యత్నం చేసింది. దీంతో ఎందుకొచ్చిన తంటా అని అనుకున్న పెద్దపులి పక్కనుంచి వెళ్లిపోయింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ