రాష్ట్రవ్యాప్తంగా రైతుల ధర్నాకు పిలుపునిచ్చిన కేసీఆర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కమెడియన్పై మండిపడిన శివసేన
Published on Fri, 09/09/2016 - 18:50
బీఎంసీ అధికారులు తన నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకున్నారని చెప్పి పెద్ద గొడవ చేసిన కమెడియన్ కపిల్ శర్మపై శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. బయటి నుంచి వచ్చి ముంబై పరువు గంగలో కలుపుతున్నాడని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. కపిల్ శర్మ స్వస్థలం పంజాబ్ అన్న విషయం తెలిసిందే. ముందుగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను కపిల్ చదువుతున్నాడని రౌత్ అన్నారు.
కపిల్ శర్మను లంచం అడిగింది ఎవరో చెప్పాల్సిందిగా తాము కోరినా.. ఆయన మాత్రం ఆ వివరాలు వెల్లడించలేదని బీఎంసీ విజిలెన్స్ శాఖ చీఫ్ ఇంజనీర్ మనోహర్ పవార్ అన్నారు. ఆయన చెబితే తాము వెంటనే విచారణ ప్రారంభించి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోడానికి వీలుంటుందని చెప్పారు. కపిల్ వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పందించారు.
#
Tags