‘రామాయణ్‌’ ప్రపంచ రికార్డు

Published on Sat, 05/02/2020 - 04:01

న్యూఢిల్లీ: రామానంద సాగర్‌ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్‌’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ళ తరువాత సైతం, ఇప్పటికీ భారతీయ టెలివిజన్‌ ప్రపంచాన్ని ఏలుతుంది. రామాయణ్‌ సీరియల్‌ను దూరదర్శన్‌ పునఃప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే రెండోసారి ప్రసారమౌతోన్న ధారావాహిక ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షిస్తోన్న కార్యక్రమంగా రికార్డయినట్టు దూరదర్శన్‌ ఇండియా ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఏప్రిల్‌ 16వ తేదీన ‘రామాయణ్‌ ను ప్రపంచవ్యాప్తంగా వీక్షించినవారి సంఖ్య అక్షరాలా 7.7 కోట్లు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసే టీవీ ప్రసారాల రికార్డుని రామాయణ్‌ బద్దలు కొట్టినట్టయ్యింది. డీడీ నేషనల్‌ ఛానల్‌లో మార్చి నుంచి తిరిగి ప్రారంభించిన రామాయణ్‌ రోజుకి రెండు సార్లు ప్రసారం అవుతోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ