amp pages | Sakshi

భారత్‌లో పర్యటించనున్న పాక్ జ్యుడీషియల్ కమిషన్

Published on Fri, 09/20/2013 - 19:57

ముంబై : నగరంలో 2008 నవంబర్ 26వ తేదీన జరిగిన తీవ్రవాదుల దాడి కేసుకు సంబంధించి  సాక్షులను విచారించేందుకు 8 మంది సభ్యులుగల పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 24న భారత్ కు రానుంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి పి.వై.లడేకర్ నమోదు చేయనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఘటనలో పట్టుబడిన పాక్ తీవ్రవాది అజ్మల్‌కసబ్ వాంగ్మూలాన్ని నమోదుచేసిన నగర న్యాయమూర్తి, కేసులో ముఖ్య నేరపరిశోధన అధికారి రమేష్ మెహలే, సెక్యూరిటీ దళాల చేతిలో హతులైన 9 మంది పాక్ తీవ్రవాదుల పోస్టుమార్టం నిర్వహించిన ఇద్దరు డాక్టర్లు పాక్ జ్యుడీషియల్ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పనున్నారు. కమిషన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. మొదటిసారి 2012 మార్చిలో కమిషన్ భారత్‌ను సందర్శించింది. అయితే అప్పుడు సాక్షులను విచారించేందుకు కమిషన్‌కు భారత్ అనుమతి ఇవ్వకపోవడంతో అప్పటి నివేదికను పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తిరస్కరించింది.
 
 

 

ఇప్పుడు వస్తున్న కమిషన్‌లో నూతన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తోపాటు పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు సంబంధించిన ఇద్దరు అధికారులు ఉన్నారు. కమిషన్ సభ్యులకు వారం పాటు పనిచేసే వీసాను బుధవారం ఇవ్వడంతో వీరు భారత్‌కు రానున్నారని  అధికారులు తెలిపారు.


 

Videos

చంద్రకాంత్ సూసైడ్..పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్

తృటిలో తప్పిన పెను ప్రమాదం

లండన్ వీధుల్లోను అదే అభిమానం

వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి

"సారీ రా బన్నీ.."

పవన్ ఫ్యాన్ కి చెంప చెళ్లుమనిపించిన రేణు

టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు

శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం ప్రారంభం

మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)