వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాక్లో భారత రాయబారికి అవమానం
Published on Sun, 06/24/2018 - 03:48
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత రాయబారిని అవమానించింది. పాక్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను భద్రతా కారణాలను సాకుగా చూపుతూ గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకుంది. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా బిసారియా కుటుంబ సభ్యులతో కలసి ఇస్లామాబాద్లోని గురుద్వారా పంజా సాహిబ్కు వెళ్లారు. ఇందు కోసం పాక్ విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు. అయితే గురుద్వారా సమీపానికి చేరుకున్నాక బిసారియాను లోపలకు అనుమతించలేదు. భద్రతా కారణాలను సాకుగా చూపిన పాక్ అధికారులు బిసారియా కారు నుంచి దిగేందుకు కూడా అంగీకరించలేదు. ఈ ఘటనపై ఢిల్లీలోని పాక్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు సమన్లు జారీచేసిన భారత విదేశాంగ శాఖ.. పాక్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర నిరసన తెలిపింది.
#
Tags