amp pages | Sakshi

'ఒప్పో' ఉద్యోగుల‌కు క‌రోనా.. కంపెనీ మూసివేత‌

Published on Mon, 05/18/2020 - 15:52

ఢిల్లీ :  ప్ర‌ముఖ చైనీస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో' ఫ్యాక్ట‌రీలో క‌రోనా క‌ల‌కలం సృష్టిస్తుంది. నోయిడాలోని ఒప్పో ఫ్యాక్ట‌రీలో ప‌నిచేస్తున్న 6మంది ఉద్యోగుల‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. దీంతో త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు ఫ్యాక్ట‌రీకి ఎవ‌రూ రావద్ద‌ని ఒప్పో ఇండియా కంపెనీ ప్ర‌తినిధి  ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అధికారిక స‌మాచారం ప్ర‌కారం..గ్రేట‌ర్ నోయిడాలోని ఒప్పో త‌యారీ సంస్థ‌లో మొత్తం 3వేల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో ఆరుగురికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో మిగ‌తా ఉద్యోగుల  భ‌ద్ర‌త దృష్ట్యా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా సంస్థ‌ను మూసివేస్తున్న‌ట్లు  ఒప్పో ఇండియా ప్ర‌తినిధి వెల్ల‌డించారు.  (కువైట్ నుంచి వ‌చ్చిన భార‌తీయుల్లో క‌రోనా )

ప్ర‌స్తుతం మిగ‌తా ఉద్యోగులంద‌రికీ స్ర్కీనింగ్  నిర్వ‌హిస్తున్నారు. వీరి ప‌రీక్షా ఫ‌లితాలు వెలువడాల్సి ఉంది.  దీంతో అప్ప‌టివ‌ర‌కు ఉద్యోగులెవ‌రూ ఫ్యాక్టరీకి రావ‌ద్ద‌ని, త‌దుప‌రి నోటీసులు వ‌చ్చాకే కార్య‌క‌లాపాలు మొదలుపెట్టాల‌ని సంస్థ యాజ‌మాన్యం ఆదేశించింది. కేవలం క‌రోనా నెగిటివ్ వ‌చ్చిన వారు మాత్ర‌మే ఫ్యాక్ట‌రీకి రావ‌ల్సిందిగా అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం ఈనెల ప్రారంభంలో ఒప్పో ఫ్యాక్ట‌రీలో య‌థావిధిగా కార్య‌క‌లాపాలు ప్రారంభించారు. దీంతో 30 శాతం మంది ఉద్యోగుల‌తో కంపెనీని తిరిగి ప్రారంభించారు. ఢిల్లీలో 24 గంటల్లోనే 299 క‌రోనా కేసులు న‌మోదుకాగా, దేశ వ్యాప్తంగా కొత్త‌గా 5వేల కోవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌లో వెలుగుచూసిన క‌రోనా కేసుల సంఖ్య 96,169 కు చేరుకుంది. 
( భారత్‌లో ఒకే రోజు 5,242 పాజిటివ్‌ కేసులు )


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌