ఇంటికి పిలిచి మోదీ హితబోధ

Published on Thu, 03/23/2017 - 19:08

న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులపై అజమాయిషీకి అంతం పలికి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఉత్తరప్రదేశ్‌ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ హితబోద చేశారు. ప్రతి ఎంపీ తమ తమ నియోజకవర్గ అభివృద్ధికోసం పనిచేయాలని చెప్పారు. ఈ మేరకు ఆయన గురువారం యూపీ ఎంపీలతో తన అధికారిక నివాసం కల్యాణ్‌ మార్గ్‌లో సమావేశం అయిన సందర్భంగా సూచించారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా హాజరయ్యారు.

‘ప్రభుత్వ అధికారుల బదిలీలు, మార్పులు చేర్పులు, నియామకాల అంశాల నుంచి దృష్టిని మరల్చాలని మాకు ప్రధాని మోదీ సూచించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని యూపీకి చెందిన ఓ ఎంపీ రహస్యంగా ఈ విషయం మీడియాకు చెప్పారు. సుపరిపాలనే అభివృద్ధికి మంత్రం అని, దానిపై తప్ప మరే ఇతర అంశాలపైనా దృష్టిసారించరాదని మోదీ చెప్పినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకొస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అభివృద్ధి జపంతోనే బీజేపీ యూపీ సీఎం పీఠాన్ని హస్తగతం చేసుకున్నందున తాజాగా ఎంపీలతో భేటీ అయ్యి అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ