'నా పరువు గంగలో కలిపేశారు'

Published on Fri, 01/30/2015 - 19:38

తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, అమెరికా మాజీ రాయబారి సుబ్రహ్మణ్యం జైశంకర్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే.. ఇదంతా చాలా దారుణమైన పద్ధతిలో చేశారని సుజాతా సింగ్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాను సోషల్ మీడియాలో చెబుతానని అన్నారు.

గత సంవత్సరమే తనను కావాలంటే వెళ్లిపోవచ్చని చెప్పారని కూడా తాజాగా ఆమె వెల్లడించారు. కావాలంటే మూడు లేదా ఐదేళ్ల పాటు రాజ్యాంగ పదవి ఏదైనా ఇస్తామన్నారని, కానీ తాను అధికారిణిగానే సేవలు అందించాలని భావించడంతో ఆ ఆఫర్ నిరాకరించానని చెప్పారు. తాను గౌరవప్రదంగా వెళ్లాలనుకున్నానని, కానీ చాలా నీచమైన పద్ధతిలో బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ