వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైలును ఆపి ఇంజన్ ఎదుటే..
Published on Thu, 07/18/2019 - 20:54
ముంబై : రైలు డ్రైవర్ ఉన్నపళంగా రైలును ఆపివేసి ఇంజన్ ముందు మూత్రం పోసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని ఉల్లాస్నగర్-విఠల్వాడి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై వెళుతున్న ఈ రైలును డ్రైవర్ అర్థంతరంగా ఆపి ఇంజన్ ముందే మూత్రవిసర్జన చేయడాన్ని వీడియో తీసిన కొందరు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రైళ్లలోని డ్రైవర్లు, గార్డుల క్యాబిన్స్లో టాయ్లెట్స్ను ఏర్పాటు చేయాలని ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇలా చేయడం డ్రైవర్ తప్పు కాదని లోకోమోటివ్, ఇంజన్ సిబ్బంది కోసం టాయ్లెట్స్ ఏర్పాటు చేయని భారత రైల్వేలదే తప్పని ఓ ట్విటర్ యూజర్ పేర్కొనగా, డ్రైవర్లు, గార్డుల క్యాబిన్లో టాయ్లెట్స్ ఏర్పాటు చేయాలని మరో ట్విటర్ యూజర్ కోరారు.
#
Tags