భారత్‌ అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు

Published on Sun, 10/22/2017 - 14:23

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌ : రక్షణ రంగాన్ని మరింత బలోపేలం చేసేదిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలను మరింత పఠిష్టం చేసుకున్న భారత్‌.. రక్షణ బంధాన్ని ధృఢతరం చేసుకుంటోంది. అమెరికా, ఫ్రాన్స్‌లతో ఇప్పటికే కీలక రక్షణ ఒప్పందాలను చేసుకున్న భారత్‌కు మరిన్ని సానుకూల సంకేతాలను ఆయా దేశాలు పంపాయి. ఫ్రాన్స్‌కు చెందిన శక్తివంతమైన రాఫెల్‌ యుద్ధవిమానాలను మరిన్ని భారత్‌కు అమ్మేందుకు ఫ్రాన్స్‌ అంగీకిరంచింది. అదే విధంగా ఆర్మ్‌డ్‌ డ్రోన్లను భారత్‌కు విక్రయించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

భారత్‌-ఫ్రాన్స్‌ దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్‌ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఫ్రాన్స్‌ రక్షణ శాఖమంత్రి ఫ్లోరున్స్‌ పార్లే వచ్చే వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. గత ఏడాది 36 రాఫెల్‌ విమానాలను భారత్‌కు విక్రయించేందుకు ఫ్రాన్స్‌ అంగీకరించిం‍ది. ఈ 36 యుద్ధవిమానాలను భారత్‌ రూ. 59 వేల కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ ఆసక్తిని చూపింది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వస్తున్న ఫ్రాన్స్‌ రక్షణ శాఖ మంత్రి భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారమన్‌, ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సీమాంతర ఉగ్రవాదం ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చర్చిస్తారు.

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను బలోపేతం చేసే దిశగా ఆర్మ్‌డ్‌ డ్రోన్లను అందించాలని భారత్‌ గతంలో అమెరికాను కోరింది. భారత ప్రభుత్వం ఆర్మ్‌డ్‌ డ్రోన్లపై కనబరిచిన ఆసక్తిని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాజాగా పరిశీలిస్తోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఆర్మ్‌డ్‌ డ్రోన్లు రక్షణ శాఖలో చేరితో.. భారత వాయుదళం మరింత శక్తివంతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఆర్మ్‌డ్‌ డ్రోన్లుగా పిలిచే అవేంజర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల కొనుగోలనుకు సంబంధించి భారత్‌ ఈ ఏడాది అమెరికాకు లేఖ రాసింది. సుమారు 100 ఆర్మ్‌డ్‌ డ్రోన్లును విక్రయించాలని అందులో భారత్‌ కోరిందని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 26న వైట్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా.. 22 గార్డియన్‌ డ్రోన్లకు భారత్‌కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించిన విషయం తెలిసిందే.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)