amp pages | Sakshi

‘షెర్పా’లా తోడుంటాం

Published on Sun, 05/13/2018 - 02:45

కఠ్మాండు: నేపాల్‌ విజయశిఖరాలు అధిరోహించేందుకు భారత్‌ షెర్పాలా సాయంచేసేందుకు సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీఇచ్చారు. యుద్ధం నుంచి బౌద్ధం వైపు ఆ దేశం సాగించిన ప్రయాణాన్ని కొనియాడారు. నేపాల్‌ పర్యటనలోభాగంగా రెండోరోజు శనివారం మోదీ చారిత్రక ముక్తినాథ్, పశుపతినాథ్‌ ఆలయాలను సందర్శించారు.

మాజీప్రధానులు ప్రచండ, షేర్‌ బహదూర్‌ దేవ్‌బా, ప్రతిపక్షనాయకులతో సమావేశమయ్యారు. నేపాల్‌ అభివృద్ధిలో భారత్‌ తోడుగా ఉంటుందని పునరుద్ఘాటించారు. తన  ఈచారిత్రక పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు కొత్తశక్తి వచ్చిందని వ్యాఖ్యానించారు. నేపాల్‌ ప్రధాని కేపీఓలితో చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. రెండ్రోజుల నేపాల్‌ పర్యటన ముగించుకుని మోదీ స్వదేశం చేరుకున్నారు. 

భారత్‌–నేపాల్‌ స్నేహం జిందాబాద్‌.. 
కఠ్మాండులో శనివారం మోదీ గౌరవార్థం ఘనంగా రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగామోదీ మాట్లాడుతూ.. ‘యుద్ధం నుంచి బౌద్ధం వైపు అడుగులేస్తూ నేపాల్‌ సుదీర్ఘ ప్రయాణం చేసింది. బ్యాలెట్‌ (ప్రజాస్వామ్యం)ను ఎంచుకోవడానికి బుల్లెట్‌(యుద్ధం)ను వదులుకున్నారు. అయితే ఇంకా గమ్యస్థానాన్ని చేరుకోలేదు. మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌క్యాంపు వరకు చేరుకున్నారు.

ప్రధాన అధిరోహణ ఇంకా జరగాల్సిఉంది. పర్వతారోహకులకు సాయంచేసే షెర్పాల మాదిరిగానే నేపాల్‌కు సాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది’అని అన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ మంత్రం భారత్‌కే పరిమితం కాలేదని, ప్రపంచహితం కోసం కూడా దోహదపడుతుందని అన్నారు. ‘భారత్‌–నేపాల్‌ స్నేహం జిందాబాద్‌’అని మోదీ తన ప్రసంగం చివరలోమూడుసార్లు నినదించారు. 

ఈ పర్యటన చరిత్రాత్మకం.. 
నేపాల్‌ పర్యటనను చారిత్రకమని మోదీ అభివర్ణించారు. ‘ఈ పర్యటన నేపాల్‌ ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం కల్పించింది. అభివృద్ధి ప్రయాణంలో నేపాల్‌కు భారత్‌ ఎప్పుడూ అండగాఉంటుంది’అని ట్వీట్‌చేశారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇదేజోరు కొనసాగించాలని మోదీ, ఓలి నిర్ణయించినట్లు ఉమ్మడి ప్రకటన వెల్లడించింది. విభిన్న రంగాల్లో సహకారం, భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుని ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు నేతలు అంగీకరించారు. భారత్‌లో పర్యటించాలన్న మోదీ ఆహ్వానాన్ని ఓలి అంగీకరించారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)