amp pages | Sakshi

మోదీ ప్రభుత్వం సూపర్

Published on Wed, 05/25/2016 - 02:09

- సంతృప్తి వ్యక్తం చేసిన 64 శాతం ప్రజలు
- తాజా అధ్యయనంలో వెల్లడి
 
 న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల ప్రభుత్వ పాలన తీరుపై మూడింట రెండొంతుల మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. లోకల్‌సర్కిల్స్ సంస్థ సర్వేలో ఈ విషయం తేలింది.  20 అంశాలతో కూడిన పత్రాన్ని 15 వేల మంది పట్టణవాసులకు అందించి అభిప్రాయాలు సేకరించారు. 64 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగుందని అభిప్రాయపడగా.. 34 శాతం మంది అనుకున్నంత బాగా లేదని పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. మహిళలు, చిన్నారుల భద్రత, ధరల నియంత్రణ తదితర కీలక అంశాల్లో మరిన్ని చర్యలు అవసరమని వారు అభిప్రాయపడినట్లు పేర్కొంది.

మొత్తంగా 76 శాతం మంది ప్రజలు భారత్‌లో తమ, తమ కుటుంబ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నట్లు సర్వే వివరించింది. అయితే రానున్న మూడేళ్లలో పెట్టుబడులు అధికంగా రాబట్టి, భారీగా ఉద్యోగాలు కల్పించాలని అధికశాతం మంది కోరుకుంటున్నట్లు పేర్కొంది. ‘జీఎస్‌టీ ఆమోదం తదితర అంశాలతో ప్రభుత్వం బాగా పనిచేసిందని 61 శాతం మంది భావించగా.. 30 శాతం మంది పనితీరు బాగా లేదని భావిస్తున్నారు. మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేయడంలో మంచి పనితీరు కనబరిచినట్లు సుమారు 72 శాతం మంది అభిప్రాయపడగా.. 20 శాతం మంది దీనికి భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు’ అని నివేదిక తెలిపింది. పలువురు ప్రవాస భారతీయులతో పాటు దేశంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలతో 20 సార్లు ఓటింగ్, చర్చలు జరిపి ఈ నివేదిక తయారు చేశారు. ఒక్కోసారి ఓటింగ్‌లో సుమారు 15 వేల మంది చొప్పున 3,75,568 మంది ప్రజల అభిప్రాయాలతో నెల రోజుల పాటు ఈ సర్వే నిర్వహించారు. అలాగే 18 ఏళ్లకు పైబడిన అన్ని వయసుల వారినీ ఓటింగ్‌లో పరిగణనలోకి తీసుకున్నారు.
 
 ‘మైనారిటీలకు నమ్మకం పెరిగింది’
  మోదీపై మైనారిటీల్లో నమ్మకం పెరిగిందని బీజేపీ ప్రకటించింది. రెండేళ్ల మోదీ పాలనలో మతకలహాలు 82 శాతం తగ్గాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మైనారిటీల వాటా పెరిగిందని మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ఢిల్లీలో తెలిపారు. బీజేపీ అభివృద్ధి అజె ండా వల్లే ముస్లింలు అధికంగా గల అస్సాం, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో  విజయం సాధించామన్నారు. 2013-14లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటా 6.91 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగిందన్నారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)