amp pages | Sakshi

కాంగ్రెస్‌ది ‘ఎమర్జెన్సీ’  మనస్తత్వం..

Published on Tue, 06/26/2018 - 14:12

సాక్షి, ముంబై : కాంగ్రెస్‌ అధికార దాహానికి, ఒక కుటుంబ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజ్యాంగం దుర్వినియోగమైందని, దేశంలో విపక్ష నేతలందరినీ జైళ్ల పాలు చేశారని ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లు అవుతున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ముంబైలో మంగళవారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కేవలం ఒక కుటుంబ మనుగడ కోసం, అధికారం నిలుపుకునేందుకు దేశం మొత్తాన్ని జైలుగా మారుస్తారని భారత్‌ ఎన్నడూ భావించి ఉండదన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రతి ఒక్కరూ భయంతో బతికారని, పాలకులు రాజ్యాంగాన్ని కాలరాశారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేనందునే ఆ పార్టీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను అనుసరించదని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చని, రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించేందుకే బ్లాక్‌ డే నిర్వహిస్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కోల్పోయిన ప్రతిసారీ దేశం ప్రమాదంలో ఉందని, దళితులు, మైనారిటీలను తామే ఉద్ధరించగలమని గగ్గోలు పెడుతుందని చెప్పుకొచ్చారు. అభిశంసన తీర్మానంతో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు న్యాయవ్యవస్థనూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎమర్జెన్సీ నాటి మనస్తత్వమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోందని విమర్శించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌