వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మావో డిప్యూటీ కమాండర్ మృతి
Published on Sat, 10/13/2018 - 05:23
పర్ణశాల(భద్రాద్రి కొత్తగూడెం): ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ కవాసి దేవా మృతి చెందారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న పుస్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసీ కొండల్లో గురువారం మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈ కాల్పులు కొనసాగాయి. అనంతరం మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోగా పోలీసులు సంఘటన స్థలంలో ఓ మావోయిస్టు మృతదేహం, ఒక తుపాకీతోపాటు బాంబు తయారీకి వాడే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
#
Tags