అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపాధి లేకపోవడంతోనే అఘాయిత్యాలు
Published on Wed, 12/04/2019 - 12:17
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వారిలో అధికంగా 16–35 ఏళ్ల వయసు కలిగిన వారే ఉన్నారని, సరైన ఉద్యోగాలు లేక నైరాశ్యంలో ఉన్నవారంతా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. దిశ ఘటనపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని కేవలం ఒక ఘటనగా పరిమితం చేసి చూడలేమని, దీన్ని సామాజిక, ఆర్థిక అంశాల్లో విశ్లేషణాత్మకంగా చూడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దిశ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
#
Tags