amp pages | Sakshi

కేరళకు విదేశీ సాయం ఎందుకు వద్దు?

Published on Thu, 08/23/2018 - 13:51

సాక్షి, న్యూఢిల్లీ : జలప్రళయంలో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రకటించిన 700 కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం సమంజసమేనా ? కాదా? అయితే ఏ మేరకు సమంజసం ? కాకుంటే ఎందుకు కాదు ? ఆపద సమయాల్లో వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని తిరస్కరించడమనే సంప్రదాయం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. 2004 సంవత్సరంలో అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.

2004లో తమిళనాడు, అండమాన్, నికోబర్‌ దీవుల్లో సునామీ వచ్చినప్పుడు, 2005లో కశ్మీర్‌లో భూకంపం వచ్చినప్పుడు, 2013లో ఉత్తరాఖండ్‌లో వరదలు, 2014లో కశ్మీర్‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశీ ఆర్థిక సహాయాన్ని వరుసగా తిరస్కరిస్తూ వస్తోంది. ఇందుకు కారణం అవి బేషరతు విరాళాలు కాకపోవడమే. తాము ఇస్తున్న ఆర్థిక సహాయంలో ఫలాన సామాజిక వర్గానికే ఎక్కువ ఖర్చు పెట్టాలని, ఫలానా అభివద్ధి కార్యక్రమాలకే ఖర్చు చేయాలని లేదా తాము అందిస్తున్న ఆర్థిక సహాయానికి ప్రతిఫలంగా వీసా నిబంధనల్లో తమ దేశానికి వెసులుబాటు కల్పించాలని, వాణిజ్య ఆంక్షలను లేదా తమ ఉత్పత్తుల దిగుమతులపై పన్నులను సడలించాలనో షరతులు ఉంటాయి.

ఆశ్చర్యంగా ఈసారే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఎలాంటి షరతులు లేకుండా ఏకంగా 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేరళకు ప్రకటించిన ఆర్థిక సహాయంకన్నా అది 15 శాతం ఎక్కువ. ఎమిరేట్స్‌ కార్మిక వర్గంలో ఎక్కువ మంది కేరళ వాసులే అవడం వల్ల ఆ దేశం ఇంతపెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బేషరుతుగా వచ్చిన ఈ ఆర్థిక సహాయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరస్కరించిందంటే దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవడం కోసమే కావచ్చు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ ఎంతో పురోభివద్ధి సాధిస్తోందని చెప్పుకుంటున్న తరుణంలో విదేశీ వితరణను స్వీకరించడం బలహీనత అవుతుండొచ్చు.

వాస్తవానికి గతంలో వచ్చిన సునామీ, వరదలు, భూకంపాలకన్నా ఇప్పుడు కేరళను ముంచెత్తిన జల ప్రళయం ఎక్కువ తీవ్రమైనది. కేరళలో కొన్ని వందల మంది మరణించడమే కాకుండా పది లక్షల మంది ప్రజలు నిరాశ్రీయులయ్యారని, 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల నష్టం వాటిళ్లి ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఇలాంటి సమయాల్లో ఏ ప్రతిఫలం ఆశించకుండా బేషరతుగా సౌహార్దపూర్వకంగా వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం స్వీకరించవచ్చు’ అని ‘నేషనల్‌ డిస్సాస్టర్‌ మేనేజ్‌ఎంట్‌ ప్లాన్‌’ సూచిస్తోంది. కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్‌ ఇస్సాక్‌ కూడా కేంద్రం దష్టికి ఇదే విషయాన్ని తీసుకొచ్చారు. ఎమిరేట్స్‌ ఇచ్చినంత ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇక్కడ నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్‌ కన్నా ఎక్కువ ఆర్థిక సహాయాన్ని స్వయంగా కేరళకు ప్రకటించాలి. కేరళ పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించాలి.

Videos

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)