వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ప్రశాంతంగా జమ్మూకశ్మీర్!
Published on Sun, 08/11/2019 - 19:00
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. జమ్ములో పోలీసులు పూర్తిగా 144 సెక్షన్ ఎత్తివేశారు. దోడా, క్రిష్టావర్ జిల్లాల్లోనూ నిషేధాజ్ఞలను తొలగించారు. కశ్మీర్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. పూంచ్, రాజౌరి, రాంబన్ జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఉదయం కొద్దిసేపు ఆంక్షలు సడలించడంతో..శ్రీనగర్లో జనం బయటకువచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు రోడెక్కాయి. బక్రీద్ సందర్భంగా జమ్ములో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గొర్రెల కొనుగోలుకు జనం మార్కెట్లకు వస్తున్నారు. జమ్మూకశ్మీర్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని... ఇప్పటివరకూ ఎలాంటి హింసాత్మక ఘటనలూ జరగలేదని రాష్ట్ర పోలీస్ డీజీ దిల్పగ్ సింగ్ స్పష్టంచేశారు. కశ్మీర్ లోయలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితీ లేదని కేంద్రహోంశాఖ స్పష్టంచేసింది.
Tags