amp pages | Sakshi

ఇమ్రాన్‌ చెప్పారు కదా..ఇక రంగంలోకి దిగండి!

Published on Thu, 07/25/2019 - 20:35

న్యూఢిల్లీ : తమ దేశంలో ప్రస్తుతం 30 నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఎట్టకేలకు పాక్‌లో ఉగ్రవాదులు ఉన్నారని అంగీకరించిన దాయాది దేశం... వారిని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని హితవు పలికింది.  ఈ మేరకు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ...‘ పాక్‌లో ఉగ్రవాదుల శిక్షణా క్యాంపులు, ఉగ్రవాదులు ఉన్నారని... వాళ్లంతా కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు శిక్షణ తీసుకుంటున్నారని ఆ దేశ ప్రధాని అంగీకరించారు. కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టు క్యాంపులపై దాడి చేసి, ఉగ్రవాదులను ఏరివేయడంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించారు.

కాగా యూఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌ సంస్థ వాషింగ్టన్‌లో నిర్వహించిన సదస్సులో బుధవారం ఇమ్రాన్‌ మాట్లాడుతూ..‘నేను అధికారంలోకి వచ్చేవరకూ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే ధైర్యం అప్పటి ప్రభుత్వాలకు లేకపోయింది. పాకిస్తాన్‌లో ఉగ్రజాడ లేకుండా చేసేందుకే ఉగ్రవాద సంస్థల నుంచి ఆయుధాలు, విద్యాసంస్థలు, అంబులెన్సులు, ఆసుపత్రులు సహా ఆస్తులను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. అదే విధంగా తమ దేశంలో దాదాపు 40,000 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వీరంతా ఆఫ్గనిస్తాన్, కశ్మీర్‌లో పోరాడినవాళ్లేనని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ వాస్తవాలు అంగీకరించారంటూ వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇమ్రాన్‌ వైఖరిని స్వాగతిస్తున్నామన్న రవీశ్‌ కుమార్‌.. పాక్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకుని... కుల్‌భూషణ్‌ జాధవ్‌ను విడుదల చేయాల్సిందిగా ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌