amp pages | Sakshi

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?

Published on Thu, 11/15/2018 - 17:59

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం ఆదేశాల మేరకు మత విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని లేదా వదంతులను తక్షణమే తొలగించడంలో సోషల్‌ మీడియా ట్విటర్‌ తాత్సారం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆరోపించింది. ఈ విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఖాతాదారులను పట్టుకునేందుకు వినియోగదారుల వ్యక్తిగత డేటాను, వారి ఫోన్‌ నెంబర్లను ఇవ్వాల్సిందిగా కూడా కేంద్రం కోరినట్లు వార్తలు వచ్చాయి.

దేశంలో పిల్లలను ఎత్తుకుపోయి వారి అవయవాలను అమ్ముకునే ముఠాలు తిరుగుతున్నాయంటూ 2017, జనవరి నెల నుంచి సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల దేశవ్యాప్తంగా జరిగిన మూక హత్యల్లో దాదాపు 33 మంది మరణించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే వదంతులు లేదా మత విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని పోస్ట్‌ చేసిన తక్షణమే తొలగించాల్సిందిగా కేంద్ర సమాచార శాఖ సోషల్‌ మీడియాను హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో ట్విట్టర్‌ తాత్సారం చేస్తున్నట్లు సోమవారం నాడు ఆరోపించింది.

డేటా రక్షణకే దేశంలో ఇప్పటి వరకు సరైన చట్టం లేదు. అలాంటప్పుడు ప్రజాభిప్రాయం లేకుండా యూజర్ల వ్యక్తిగత డేటాను, ఫోన్‌ నెంబర్లను ప్రభుత్వం అడగడం ఏమిటీ? వ్యక్తిగత డేటాను ఇవ్వడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ట్విటర్‌ కేంద్రానికి సూచించింది. ఇప్పటికే విద్వేశ చట్టాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలే దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత డేటాలు ప్రభుత్వం చేతికందితే దుర్వినియోగం కావన్న గ్యారంటీ ఏముంది? పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారన్న కారణంగా మధ్యప్రదేశ్‌లో ఒక్క 2017లోనే 15 మందిపైన దేశ ద్రోహం కేసులను పోలీసులు బనాయించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారన్న కారణంగా ఓ 18 ఏళ్ల యువకుడిని అరెస్ట్‌ చేశారు.

ఒడిశాలోని కోణార్క్‌ దేవాలయంపై బూతు విగ్రహాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించినందుకు గత సెప్టెంబర్‌ నెలలో ఓ రక్షణ శాఖ విశ్లేషకుడిని అరెస్ట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకు బీజేపీ మీడియా సెల్‌ ఉద్దేశపూర్వకంగా నకిలీ ఫొటోలను పోస్ట్‌ చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోని కేంద్ర ప్రభుత్వం, మత విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని తక్షణం తొలగించాలనడంలో ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)