రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తుపాన్ హెచ్చరిక: ముందే వరి కోతలు
Published on Mon, 11/13/2017 - 16:33
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో రైతులు వరి కోత పనులు మొదలుపెట్టారు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు రైతులు ముందస్తుగా వరి కోతలు చేపట్టారు. బంగాళాఖాతంలో నైరుతి దిశగా అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర ఉపరితలంపై 7.6 కిలోమీటర్ల మేర తుపాను ఏర్పడనుందని తెలిపింది.
ఈశాన్య దిశగా ఒడిశా తీరంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా తెలిపింది. సముద్రం భీకరంగా ఉంటుందని, జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వెంటనే వరి కోతలు ప్రారంభించి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది.
#
Tags