రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కట్నంగా 1001 మొక్కలు
Published on Tue, 06/26/2018 - 02:48
కేంద్రపర (ఒడిషా): ఒడిషాలోని కేంద్రపర జిల్లాలో ఓ ప్రకృతి ప్రేమికుడు కట్నానికి బదులుగా 1001 మొక్కలు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి అందుకున్నాడు. 33 ఏళ్ల సరోజ్కాంత బిశ్వాల్ అనే ఈ స్కూల్ టీచర్ ఈ విధంగా ప్రకృతిపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. కట్నానికి తాను బద్ధ వ్యతిరేకినని, దానికి బదులుగా తనకు ఈ పండ్ల మొక్కలు ఇవ్వాలని వధువు తరఫు వారిని కోరినట్లు బిశ్వాల్ చెప్పారు. శనివారం ఆయన వివాహం జరిగింది. బిశ్వాల్ వివాహం టపాసులు కాల్చడం లాంటి ఆడంబరాలు లేకుండా జరిగిందని వధువు గ్రామస్తులు చెప్పారు. కట్నం నిరాకరించి, ఇలా మొక్కలు తీసుకోవడం తన భార్య రష్మిరేఖకు చాలా సంతోషం కలిగించిందని బిశ్వాల్ చెప్పారు. రష్మిరేఖ కూడా ఉపాధ్యాయురాలే.
#
Tags