amp pages | Sakshi

ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత: గంభీర్‌

Published on Fri, 04/24/2020 - 12:21

న్యూఢిల్లీ: ‘‘నా చిన్నారులను జాగ్రత్తగా చూసుకునే ఆమె.. ఎన్నటికీ పనిమనిషి కాబోరు. తను మా కుటుంబంలో సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత’’అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ మానవత్వం చాటుకున్నారు. ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన సరస్వతి పాత్రా(49) అనే మహిళ గత ఆరేళ్లుగా గంభీర్‌ ఇంట్లో పనిచేస్తున్నారు. డయాబెటీస్‌, బీపీ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 21న ఆమె మరణించారు. కాగా ప్రస్తుతం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సరస్వతి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గంభీర్‌ దృష్టికి తీసుకురాగా..  స్వయంగా తానే దగ్గరుండి సరస్వతి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న గంభీర్‌.. ‘‘ కుల, వర్గ, ప్రాంత, సామాజిక అంతరాలకు అతీతంగా వ్యవహరించడంలోనే హుందాతనం ఉంటుందని నమ్ముతాను. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు. నా దృష్టిలో అదే నిజమైన భారత్‌! ఓం శాంతి’’ అని ట్వీట్‌ చేశారు. (లాక్‌డౌన్‌ : పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు)

ఈ క్రమంలో పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్‌ సహృదయుడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సైతం గంభీర్‌ను ప్రశంసించారు. సరస్వతికి చికిత్స అందించే విషయంలో, తను మరణించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించి గంభీర్‌ మానత్వాన్ని ప్రదర్శించారన్నారు. గంభీర్‌ వ్యవహరించిన తీరు ఎంతో మందికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. కాగా లాక్‌డౌన్‌ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. ఆత్మీయులను కడసారి చూసుకునే వీలు లేకుండా చేస్తోంది. 

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌