ఘోర రోడ్డు ప్రమాదం; 14 మంది మృతి

Published on Thu, 02/13/2020 - 07:24

ఫిరోజాబాద్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లో  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఢిల్లీ నుంచి బీహార్‌లోని మోతీహరికి వెళ్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. కాగా ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆగ్రా- లక్నో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ