క‌రోనాతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి మృతి 

Published on Thu, 07/16/2020 - 20:54

సాక్షి, ల‌క్నో :  క‌రోనా సామాన్యుల నుంచి రాజ‌కీయ‌నేత‌ల వ‌ర‌కు అంద‌రినీ క‌బ‌లిస్తుంది. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కుడు ఘూరా రామ్ గురువారం క‌రోనా వైరస్‌ కారణంగా మ‌ర‌ణించారు. దగ్గు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్త‌డంతో రెండు రోజుల క్రితం ఆయన్ని ల‌క్నోలోని  కింగ్ జార్జ్ హాస్పిట‌ల్‌లో చేర్పించిన‌ట్లు ఆయ‌న కుమారుడు సంతోష్ కుమార్ వెల్ల‌డించారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా  ఘూరా రామ్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ప్ర‌త్యేక వైద్య సిబ్బంది ఆయ‌న‌కు చికిత్స అందించ‌గా, అప్ప‌టికే ఆరోగ్యం విష‌మించడంతో క‌న్నుమూసిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. బీఎస్పీ వ్య‌వ‌స్థాప‌కుడు కాన్షీరామ్‌కు ఘూరా రామ్ ఎంతో విశ్వాస‌పాత్రుడిగా కొన‌సాగారు. ఘూరా రామ్ 1993, 2002, 2007 సంవత్స‌రాల్లో ఎమ్మెల్యేగా, మాయావ‌తి ప్ర‌భుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఆయన జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (క్షీణించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ఆరోగ్యం) 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ