కేజ్రీవాల్‌పై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్‌

Published on Mon, 08/13/2018 - 15:45

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, 11 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు సోమవారం తీస్‌ హజారి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. వీరిలో కేజ్రీవాల్‌, సిసోడియా, మరో 9 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేశారు. మరో ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలపై చీఫ్‌ సెక్రటరీని కొట్టారనే అభియోగాలు మోపారు. ఫిబ్రవరి 19న చీఫ్‌ సెక్రటరీ అన్షు ప్రకాష్‌పై కేజ్రీవాల్‌ అధికార నివాసంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.

దాడి జరిగిన సమయంలో కేజ్రీవాల్‌ అక్కడే ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేజ్రీవాల్‌ సహా దాడి సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, 11 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. దాడి కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు అమనతుల్లా ఖాన్‌, ప్రకాష్‌ జర్వాల్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటన ఢిల్లీ ప్రభుత్వం, ఐఏఎస్‌ అధికారుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక ఆప్‌ ఎమ్మెల్యేలకు, బ్యూరోక్రాట్లకు మధ్య సాగుతున్న వివాదం తాజా చార్జిషీట్‌తో మరింత ముదిరింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ