రాజస్తాన్‌ ఆర్డినెన్స్‌పై ఐఎన్‌ఎస్‌ ధ్వజం

Published on Thu, 10/26/2017 - 04:54

న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రభుత్వ అధికారులు, జడ్జీలకు విచారణ, వారి అవినీతిపై మీడియా కవరేజీ నుంచి రక్షణ కల్పిస్తూ రాజస్తాన్‌ సర్కారు ఆర్డినెన్స్‌ తేవడాన్ని ‘ది ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) అధ్యక్షులు అఖిల ఉరంకార్‌ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర సర్కారు నిర్ణయం మీడియా గొంతు నొక్కేయడమేనన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలపై దాడేనని విమర్శిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఇలాంటి ఆర్డినెన్స్‌ తేవడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. అధికారులు, మాజీ జడ్జీలను విధి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ముందస్తు అనుమతిలేకుండా విచారణ, అవినీతి వ్యవహారాలపై మీడియా కథనాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేవడాన్ని ఆమె ఆక్షేపించారు. ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ సెలక్ట్‌ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ