‘అధికారంలోకి వస్తే జీఎస్‌టీని మార్చేస్తాం’

Published on Wed, 01/31/2018 - 15:49

సాక్షి, షిల్లాంగ్‌ : కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జీఎస్‌టీ స్వరూపాన్ని మార్చివేస్తామని, దాన్ని సరళతర పన్ను వ్యవస్థగా రూపొందిస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సంక్లిష్టతలతో కూడిన జీఎస్‌టీని తాము అధికారంలోకి వస్తే సరళీకరిస్తామని రాహుల్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

గతంలోనూ రాహుల్‌ పలుమార్లు జీఎస్‌టీపై కేంద్రాన్ని నిలదీశారు. నూతన పన్ను వ్యవస్థను గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌తో పోల్చారు. సామాన్యులు, చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ గుదిబండగా అభివర్ణించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయాలో పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగేందుకు మహిళలకు అవకాశం కల్పిస్తామని రాహుల్‌ పేర్కొన్నారు. ఎక్కువ మందికి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చేందుకు పెద్దసంఖ్యలో మహిళలు పార్టీలో చేరాలని ఆయన ఆహ్వానించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ