amp pages | Sakshi

సరిలేరు నీకెవ్వరు..!

Published on Wed, 12/04/2019 - 08:14

ఎనిమిది నెలల క్రితం ఉపగ్రహం కనిపించకుండా పోయింది. దాని ఆచూకీ కోసం ప్రపంచంలోనిపలువురు అంతరిక్షశాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైనారు. అయితే తమిళనాడుకుచెందిన ఒక యువ ఇంజినీరు అనేక పరిశోధనలు చేసి ఆ ఉపగ్రహం అచూకీని కనిపెట్టేశారు. అందరిచేతా అభినందనలుఅందుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) శాస్త్రవేత్తలు 2008లో చంద్రయాన్‌–1 అంతరిక్ష నౌకను అంతరీక్షంలోకి ప్రవేశపెట్టారు. ఆ అంతరీక్ష నౌక చంద్రుడి చుట్టూ తిరిగి అక్కడ నీరున్నట్లు నిర్ధారించింది. ఈ విజయోత్సాహంతో చంద్రుడిలోని హీలియం వాయువుపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్‌–2ను ప్రయోగించారు. ఈ వాహన నౌకలో ఆర్బిట్టర్, విక్రం ల్యాండర్‌ అనే రెండు రెండు ఉపగ్రహాలను అమర్చారు. చంద్రుని చుట్టు తిరుగుతూ పరిశోధనలు చేసేలా ఆర్బిట్టర్, చంద్ర మండలంపై దిగి పరిశోధనలు చేసేలా విక్రం ల్యాండర్‌ను రూపొందించారు. దురదృష్టవశాత్తు విక్రంల్యాండర్‌ చంద్రమండలంపై దిగేందుకు మరో 2 కి.మీ దూరంలో ఉండగా వేగంగా పయనిస్తూ తన దిశను మార్చుకుని చంద్రునిపై కూలిపోయింది. ఈ పరిణామంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత ఇస్రో శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా ల్యాండర్‌ జాడ కానరాలేదు. ల్యాండర్‌ ఆచూకీ కోసం ఆమెరికాలోని నాసా సంస్థ వందలాది ఫొటోలను తీసినా అంతుచిక్కలేదు. నాసా తీసిన ఫొటోలను ఇంటర్నెట్‌ ద్వారా బహిరంగపరిచారు.

ఈ ఫొటోల ఆధారంగా శాస్త్రవేత్తలు ఎవరైనా ల్యాండర్‌ను గుర్తించవచ్చని ప్రకటించారు. ఈ దశలో మధురైకి చెందిన షణ్ముగ సుబ్రమణ్యం అనే యువ ఇంజినీరు ల్యాండర్‌ను కనుగొనడాన్ని సవాలుగా స్వీకరించారు. కంప్యూటర్‌ ఇంజినీరైన అతను చెన్నై అడయారులో ఒక ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నాడు. విధులు  ముగిసిన తరువాత ల్యాండర్‌ను కనుగొనేందుకు సమయం వెచ్చించేవాడు. సెప్టెంబర్‌ 17, అక్టోబర్‌ 14, 15, నవంబర్‌ 1వ తేదీన నాసా విడుదల చేసిన ఫొటోలపై పరిశోధనలు చేసి విక్రం ల్యాండర్‌ కూలిపోయి 24 చోట్ల చెల్లాచెదరుగా పడి ఉండడాన్ని విజయవంతంగా గుర్తించాడు. ల్యాండర్‌ను గుర్తించినట్లు ఈమెయిల్‌ ద్వారా నాసాకు సమాచారం ఇచ్చాడు. నాసా శాస్త్రవేత్తలు సైతం సుబ్రమణ్యం పంపిన సమాచారాన్ని విశ్లేషించి నిర్ధారించుకున్నారు. ఎనిమిది నెలల తరువాత ల్యాండర్‌ను గుర్తించడం చంద్రయాన్‌–3 ప్రయోగానికి తోడ్పడుతుందని పేర్కొంటూ ఇస్రో శాస్త్రవేత్తలు, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్, అమ్మముక ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ తదితరులు షణ్ముగ సుబ్రమణ్యంను అభినందనలతో ముంచెత్తారు. నాసా విడుదల చేసిన ఫొటోలను పరిశీలించినపుడు అందులో చుక్కలు తప్ప మరేవీ లేవు. ఆ చుక్కలే ల్యాండర్‌ శిథిలాలుగా ఉండొచ్చని పరిశోధనలు చేశాను. చివరకు అదే నిజమైందని షణ్ముగ సుబ్రమణ్యం మీడియాకు తెలిపాడు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)