amp pages | Sakshi

మోదీ మౌనంపై పుస్తకం.. కేసు నమోదు

Published on Fri, 09/21/2018 - 16:04

సాక్షి,  న్యూఢిల్లీ : గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారంటూ ముగ్గురు రచయితలు విడుదల చేసిన పుస్తకం అసోంలో వివాదంగా మారింది. అసొంలో 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్య పుస్తకంలో గోద్రా అల్లర్లపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రచయితలు 2011లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. సీఎంగా ఉన్న మోదీ అల్లర్లపై మౌనం వహించారని, దీంతో ఎంతో మంది అమాయక ప్రజల మరణానికి ఆయన కారణం అయ్యారని పుస్తకంలో వారు పేర్కొన్నారు.

 ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పుస్తకాన్ని ముద్రించారని, దానిని వెంటనే బ్యాన్‌ చేయాలని కోరుతూ సుమిత్రా గోస్వామి, మానవ్‌ జ్యోతిలు పిటిషన్ దాఖలు చేశారు. మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, విద్యార్థులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ పుస్తకాన్ని ముద్రించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పుస్తక రచయితలైన దుర్గా శర్మ, అఫిక్‌ జామాన్‌, బుర్హాన్‌లపై అసోంలోని గల్హట్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. దీనిపై రచయితలు స్పందిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఆర్‌టీ) సిలబస్‌ ప్రకారమే పుస్తకాన్ని రచించామని.. మోదీని తప్పుపట్టే విధంగా దానిలో ఎలాంటి అంశాలు లేవని రచయితలు తెలిపారు.

2011 నుంచి ఆ పుస్తకం పబ్లిష్‌ అవుతోందని ఇప్పుడు అనవసరంగా దానిపై వివాదం చేస్తున్నారని వారు వాపోయారు. దీనిపై అసోం విద్యాశాఖ మంత్రి సిద్దార్ధ భట్టాచార్య మాత్రం స్పందించేందుకు నిరాకరించారు. కాగా 2002 ఫిబ్రవరిలో గోద్రా సమీపంలో సబర్మతి రైలు తగలబడడంతో దాదాపు 57కిపైగా ప్రయాణికుల దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన మతఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో సీఎంగా ఉన్న మోదీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌