ఆస్పత్రి నుంచి జైట్లీ డిశ్చార్జి

Published on Mon, 06/04/2018 - 15:58

సాక్షి, న్యూఢిల్లీ : కిడ్నీ మార్పిడి కోసం మూడు వారాల పాటు ఎయిమ్స్‌లో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎయిమ్స్‌లో తన పట్ల ఆప్యాయత కనబరిచిన వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ జైట్లీ ట్వీట్‌ చేశారు. మే 12న ఆస్పత్రిలో చేరిన జైట్లీ (65)కి మే 12న శస్త్రచికిత్స జరిగింది. అప్పటినుంచి ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్‌​సోకకుండా ఆయనకు ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించారు.

మోదీ సర్కార్‌ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆస్పత్రి నుంచే ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉందని,  గత మూడువారాలుగా తనకు అంకితభావంతో సేవలందించిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడిక్స్‌ అందరికీ కృతజ్ఞతలంటూ జైట్లీ ట్వీట్‌ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, సహచరులు, స్నేహితులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. జైట్లీ ఆస్పత్రిలో ఉండగా రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ