వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మన గగనతలంలో పాక్ డ్రోన్ ప్రత్యక్షం..
Published on Wed, 10/16/2019 - 11:04
చండీగఢ్ : పంజాబ్లోని ఫిరోజ్పూర్ వద్ద వారం కిందట పాకిస్తాన్కు చెందిన డ్రోన్ చక్కర్లు కొట్టిన అనంతరం మరోసారి పంజాబ్లో పాక్ సరిహద్దు సమీపంలో పొరుగు దేశానికి చెందిన డ్రోన్ స్ధానికుల కంటపడింది. ఇండో-పాక్ సరిహద్దు గ్రామాలు హజారాసింగ్ వాలా, బక్డీ ప్రాంతంలో పాక్ డ్రోన్ ఎగురుతూ గ్రామస్తుల కంటపడిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ వైపు నుంచి భారత గగనతలంలో ఒక కిలోమీటర్ వరకూ ఈ డ్రోన్ దూసుకువచ్చిందని స్ధానికులు చెప్పారు. బీఎస్ఎఫ్ హెచ్కే టవర్ సమీపంలో పంట పొలాల మీదుగా డ్రోన్ చక్కర్లు కొడుతూ సరిహద్దు దాటిందని, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఈ డ్రోన్ భారత్ వైపు ఏమైనా జారవిడిచిందా అనేది నిర్ధారించాల్సి ఉందని బీఎస్ఎఫ్ పేర్కొంది.
#
Tags