డీజే ఆరోపణలు.. ఎయిర్‌ ఇండియా రిప్లై

Published on Fri, 08/24/2018 - 17:32

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ ఇండియా సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఇటాలియన్‌ డీజే ఒల్లీ ఎస్సే చేసిన ఆరోపణలపై ఎయిర్‌ ఇండియా స్పందించింది. ఇటాలియిన్‌ డీజే చేసిన ఆరోపణలు అసత్యమైనవని, తమ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించలేదని కొట్టిపారేసింది. సమయానికి పోలీసులు కూడా అందుబాటులో లేరని ఆరోపించిన ఇటాలియన్‌ డీజేకు విమానశ్రయ పోలీసు అధికారి బదులిచ్చారు. సంఘటన జరిగిన రోజంతా తాను పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్నానని, తమ అధికారులు చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమెకు వివరించారు.

అసలేం జరిగిందంటే..
ఇటాలియన్‌ డీజే ఒల్లీ ఎస్సే హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిర్ ఇండియా సిబ్బంది తనపై చేయి చేసుకున్నట్టు ఆరోపించారు. ఈ క్రమంలో వారిపై కేసు పెట్టేందుకు విమానశ్రయ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్తే ఎస్సై లేడని, తమకు ఏం తెలియదని అక్కడి పోలీసులు చెప్పారని.. అంతే కాకుండా అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని వివరించారు.  విమానశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా విమానం 9 గంటలు ఆలస్యమైందని, అందుకే తాను ఎక్కాల్సిన విమానం ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు డిపరేచర్ గేటు వద్దనున్న అధికారుల దగ్గరికి వెళ్లినట్లు వీడియోలో పేర్కొన్నారు. కానీ, అక్కడి సిబ్బంది స్పందించకపోవడంతో పక్కనే ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లి అడగగా అది తనపని కాదని బిగ్గరగా అరిచారని, మరోసారి అడిగితే చేయిచేసుకున్నారని వీడియోలో పేర్కొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ