మైనర్‌ను రేప్‌ చేసి, సజీవ దహనం.. 14 మంది అరెస్ట్‌

Published on Sat, 05/05/2018 - 17:29

ఛాత్రా (జార్ఖండ్‌) : ఒకదాన్ని మించి మరో ఘోరం, దేశవ్యాప్తంగా ఆగని అత్యాచారాలు.. తాజాగా జార్ఖండ్‌ రాష్ట్రం ఛాత్రా జిల్లాలోని రాజా కెందువా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికను రేప్‌ చేసి ఆపై ఆమెను బతికుండగానే నిప్పంటించి హతమార్చారు. అయితే ఈ సంఘటనలో నిందితులైన 18 మందిలో 14 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే.. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరైన బాలికపై శుక్రవారం మధ్యాహ్నం ధను భుయియన్‌ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తండ్రి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయగా.. వారు పంచాయితీ నిర్వహించి నిందితుడికి రూ.50 వేల జరిమానా విధించారు.

దీంతో బాధిత కుటుంబంపై ఆగ్రహించిన నిందితుడు ధను, అతని అనుచరులు బాధిత కుటుంబంపై దాడి చేశారు. అత్యాచారానికి గురైన బాలికను సజీవ దహనం చేశారు. పోలీసులు ధను, అతని అనుచరులు, పంచాయితీ నిర్వహించిన పెద్దలపై కేసులు నమోదు చేశారు. మొత్తం 18 మందికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు తేల్చి వారిలో 14 మందిని శనివారం అరెస్టు చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. గ్యాంగ్‌ రేప్‌ చేసినందకు వీరిని అరెస్టు చేసిన బాలిక పోస్ట్‌ మార్టమ్‌ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత తగు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కెందువా గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ