వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
నా చేతిలో ఉన్నవి రెండు సినిమాలే
Published on Wed, 02/10/2016 - 14:59
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాథం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించినా అవి కూడా ఆమె కెరీర్కు పెద్దగా ఉపయోగపడలేదు.
దీంతో బాలీవుడ్ బాట పట్టిన తాప్సీ చష్మే బదూర్ సినిమాతో అక్కడ కూడా మంచి గుర్తింపునే సాధించింది. తాజాగా ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉందంటూ వస్తున్న వార్తలపై తాప్సీ స్పందించింది. తన చేతిలో కేవలం రెండు సినిమాలే ఉన్నాయన్న తాప్సీ, ఘాజీతో పాటు, రైజింగ్ సన్ ఫిలింస్ బ్యానర్లో మరో సినిమా చేస్తున్నానంటూ ప్రకటించింది.
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో సినిమా చేయనున్నట్టుగా వస్తున్న వార్తలను ఖండించింది. కాళీగా ఉన్నప్పుడు కూడా బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు ఇండస్ట్రీ జనాలు. అలాంటిది, ఇలా అవకాశాల్లేవని చెప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావలంటున్నారు విశ్లేషకులు.
For all the speculations and source stories, I'm right now on for #Ghazi and an untitled movie under #RisingSunFilms ONLY *period*
— taapsee pannu (@taapsee) February 9, 2016
Tags