భరత్ అను సల్మాన్

Published on Tue, 10/24/2017 - 12:56

సాక్షి, సినిమా : ఈద్‌ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ సల్మాన్ ఖాన్‌ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. భరత్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేశాడు. అలీ అబ్బాస్‌ జఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

బెర్లిన్ చిత్ర ఫెస్టివల్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ‘ఒడే టూ మై ఫాదర్’ అనే చిత్రం ప్రదర్శితం కాగా, కథ బాగా నచ్చిన ప్రముఖ నిర్మాత అతుల్ అగ్నిహోత్రి తెరకెక్కించేందుకు ముందుకు వచ్చారు. దేశం కోసం ఓ వ్యక్తి ప్రయాణం.. అన్న కథాంశంతో ఇది రూపొందబోతుందని అతుల్ ప్రకటించారు. గతలో వీరి కాంబినేషన్ లో వచ్చిన బాడీగార్డ్ లాగే ఇది పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

సౌత్ కొరియన్ మూవీ ఒడే టూ మై ఫాదర్ చిత్రం ప్రేరణతో కథను సిద్ధం చేశామని దర్శకుడు అలీ అబ్బాస్‌ ప్రకటించారు. 1950లో కొరియన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఆ చిత్రం ప్రశంసలు అందుకుంది. దానిని ఇక్కడి నేటివిటికి తగ్గట్లుగా మార్చి తెరకెక్కించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో పాత్రధారుల ఎంపిక పూర్తి చేసి షూటింగ్ వివరాలను తెలియజేయనున్నట్లు అలీ చెప్పారు. 2019 ఈద్ సందర్భంగా భరత్ విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం సల్మాన్ టైగర్ జిందా హై షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా.. ఈ యేడాది చివర్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ