రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాటలే బ్యాలెన్స్
Published on Fri, 05/15/2020 - 05:01
‘క్రాక్’ షూటింగ్ క్లైమాక్స్కు చేరుకుంది. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహ నిర్మాత. ఇందులో సముద్రఖని, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయిందని చిత్రబృందం పేర్కొంది. అలాగే ఓ వారం రోజులు ప్యాచ్వర్క్ ఉంటుందట. షూటింగ్స్ చేయడానికి అనుమతి వచ్చిన వెంటనే ఈ రెండు పాటలను పూర్తి చేసి, వెంటనే రిలీజ్ కార్యక్రమాలు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది ‘క్రాక్’ చిత్రబృందం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
#
Tags