రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సినిమా రంగ పరిస్థితులపై..
Published on Mon, 06/19/2017 - 23:53
రవీంద్రతేజ్, అక్షర జంటగా ఎల్వీ మూవీ మేకర్స్ పతాకంపై వి. క్రాంతి కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రంగుల కల’ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సిద్ధేశ్వర పీఠం స్వామి విశ్వదానంద కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎం. రాజ్కుమార్ క్లాప్ ఇచ్చారు.
దర్శక–నిర్మాత వి. క్రాంతి కుమార్ మాట్లాడుతూ – ‘‘చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను తెలియజేసే చిత్రమిది. వరూధిని అనే హీరోయిన్ను ఓ పల్లెటూరులో రైతు కొడుకు ఇష్టపడతాడు. ఆమెను కలుసుకుని, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడన్నదే కథ. హైదరాబాద్, అమరావతి, కర్ణాటకల్లో షూటింగ్ చేస్తాం. ఈ సినిమా కోసం రాజ్కుమార్గారు మంచి సహకారం అందిస్తున్నారు’’ అన్నారు.
#
Tags