తమిళ చిత్రాలతోనే గుర్తింపు

Published on Tue, 01/27/2015 - 00:56

తమిళ చిత్రాలతోనే తాను గుర్తింపు పొందినట్లు నటి నీతుచంద్ర పేర్కొన్నారు. ఈ బెంగాలీ సుందరి సొంతగడ్డపై నటిగానే కాకుండా నిర్మాతగా త్రాలు నిర్మించి అవార్డులు పొందారు. అయినా తమిళ చిత్రాలపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. కోలీవుడ్‌లో యావరుం నలం చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఆదిభగవాన్ తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవల చెన్నైకి విచ్చేసిన ఈ బ్యూటీ మాట్లాడుతూ ఏడాది గ్యాప్ తరువాత మళ్లీ తమిళంలో ఒక చిత్రం చేయనున్నానని చెప్పారు. దర్శకుడు షాజి కైలాష్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కథ చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు.
 
 తానిప్పటి వరకు పోషించనటువంటి పాత్రను ఈ చిత్రంలో పోషించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనన్నారు. మంచి సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రంగా ఉంటుందన్నారు. వ్యాపారాత్మక చిత్రాల్లో నటించే అవకాశాలు తనకు ఇక్కడే లభిస్తున్నాయన్నారు. తాజా చిత్రంలో కూడా ఆ తరహా పాత్రనే పోషించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం చెన్నై, విశాఖపట్నం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుందని చెప్పారు. ఇటీవల 1980 ప్రాంత నటీనటుల విందులో కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఇందులో నటి శ్రీప్రియకు అంకితం ఇచ్చేలా ఆమె నటించిన చిత్రంలోని పాటకు తాను నర్తించానన్నారు. ఇది తనకు తీయని అనుభూమితిని మిగిల్చిందన్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ