రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిదరే లేదే
Published on Wed, 06/20/2018 - 00:24
ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన కల్యాణ్ రామ్ మూడో సినిమా కూడా రెడీ చేసే పనిలో పడ్డారు. దాని కోసం నిద్ర లేకుండా నైట్ అంతా పని చేస్తున్నారు. కెమెరామేన్ కె.వి.గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇందులో షాలినీ పాండే, నివేథా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మొత్తం నైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో నివేథా తన పార్ట్ కంప్లీట్ చేశారట. ప్రస్తుతం కల్యాణ్రామ్పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ నైట్ షెడ్యూల్ సాగనుందని సమాచారం.
#
Tags